LIVE: తునిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు "రా కదలిరా" బహిరంగసభ- ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2024, 12:30 PM IST

Updated : Jan 10, 2024, 7:20 PM IST

thumbnail

Chandrababu Raa Kadali Raa Public Meeting Live: విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో పసుపుదళం కదం తొక్కింది. బొబ్బిలిలో నిర్వహించిన "రా కదలిరా" మహాసభకు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు "రా-కదిలిరా" నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని టీడీపీ బొబ్బిలిలో నిర్వహించింది. బొబ్బిలి రాజా కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

తర్వాత మధ్యాహ్నం కాకినాడ జిల్లా తుని బహిరంగ సభలో పాల్గొంటారు. వైఎస్సార్సీపీ పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అరాచకాలు ప్రజలకు వివరిస్తారు. "రా కదలి రా" సభ ఏర్పాట్లను టీడీపీ, జనసేన నాయకులు కలిసి పరిశీలించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించాలని ఇరు పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు విడుదల తర్వాత బొబ్బిలిలో నిర్వహించిన మొదటి సభకు నేతలు ప్రజలు భారీగా చేరుకుని సభను విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో బొబ్బిలిలో "రా కదిలిరా" బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారం.

Last Updated : Jan 10, 2024, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.