ETV Bharat / lifestyle

SWARNA BHARAT TRUST: పల్లెతనం, తెలుగుదనం కలబోసిన లోగిలి!

author img

By

Published : Jul 31, 2021, 12:42 PM IST

SWARNA BHARAT TRUST
SWARNA BHARAT TRUST

చుట్టూ కాలుష్యం.. రణగొణ ధ్వనుల మధ్య సతమతమయ్యే జీవనాల్లో.. ఓ చక్కటి పల్లెటూరి వాతావరణం కనిపిస్తే.. పక్షలు కిలకిలరావాలతో పలకరిస్తే.. పచ్చని చెట్లు మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తే.. ఆహా.. ఈ ఊహా ఎంతబాగంటుందో అనుకుంటున్నారా? అదే ఆలోచనతో నగరంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్ణశాలను ప్రత్యేక అభిరుచితో నిర్మించుకున్నారు.

SWARNA BHARAT TRUST
పర్ణశాల’

తాటి దుంగల స్తంభాలు, రెల్లుగడ్డి పైకప్పుతో నిర్మించిన విశాలమైన పాక.. కల్లాపి చల్లి.. రంగవల్లులతో తీర్చిదిద్దిన నేల.. చుట్టూ పచ్చని చెట్లు, పచ్చికబయళ్లు, పక్కన నీటి కుంట.. పక్షుల కిలకిలారావాలు.. చూసిన వెంటనే పల్లెల్లో గడిపిన తమ బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చేలా, మనసుకు రెక్కలు తొడిగేలా ఉన్న ఈ ‘పర్ణశాల’.. శంషాబాద్‌ సమీప ముచ్చింతల్‌ స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో ఉంది.

SWARNA BHARAT TRUST
అతిథులతో కలిసి భోజనం చేస్తున్న ఉపరాష్ట్రపతి

తెలుగుదనం, పల్లెతనం కలబోసిన ఈ నిర్మాణాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక అభిరుచితో 2017లో నిర్మించుకున్నారు. ఇందుకోసం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నుంచి 42 తాటి దుంగలు తెప్పించారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు.. కుటుంబసభ్యులు, అతిథులతో కలిసి ఉపరాష్ట్రపతి ఇందులోనే భోజనం చేస్తుంటారు. ఇటీవల ట్రస్ట్‌కు వచ్చిన వెంకయ్యనాయుడు.. బ్యాంకుల అధికారులతో సమావేశం అనంతరం పర్ణశాలలో అల్పాహారం తీసుకుంటూ ఇలా కనిపించారు.

ఇదీ చూడండి:

ఆన్​లైన్​లో వైద్యుల సూచనలు.. పురుడు పోసిన 108 సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.