ETV Bharat / jagte-raho

మతిస్థిమితం లేని యువకుడిపై దాడి

author img

By

Published : Nov 8, 2020, 9:43 PM IST

మతిస్థిమితం లేని యువకుడిని గ్రామ పంచాయతీ ముందు చేతులు కట్టేసి కొట్టిన ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్​లో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్నవారు ఈ ఘటనను సెల్​ఫోన్​లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేశారు.

మతిస్తిమితం లేని యువకుడిపై దాడి
మతిస్తిమితం లేని యువకుడిపై దాడి

మతిస్తిమితం లేని యువకుడిపై దాడి

తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్​లో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని లక్కవత్తుల రాజు అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి కొడుకు.. చేతులు కట్టేసి శనివారం కర్రతో చితకబాదాడు. ఈ దృశ్యాలను కొందరు సెల్​ఫోన్​లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేశారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు దాడి చేసిన ఆకుల శ్రీనివాస్, ఎనగంటి శేఖర్, నర్సవ్వపై కేసు నమోదు చేశారు. మహిళను దూషించాడన్న ఆరోపణపై దెబ్బలుతిన్న వ్యక్తి రాజుపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్టు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.