ETV Bharat / elections

బెజవాడలో అత్యల్పంగా 58.04 శాతం పోలింగ్ నమోదు

author img

By

Published : Mar 11, 2021, 3:13 AM IST

రాష్ట్రంలో మున్సిపల్‌ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ క్రమంలో బెజవాడ పురపోరులో కేవలం 58.04 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదయ్యింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప ఓటింగ్ శాతంగా రికార్డులకెక్కింది.

Less Polling Percentage at Vijayawada in krishna district
బెజవాడ పురపోరులో అత్యల్పంగా 58.04 శాతం పోలింగ్ నమోదు

పురపాలిక ఎన్నికల్లో భాగంగా బెజవాడలో పోలింగ్ ముగిసే సమయానికి కేవలం 58.04 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప ఓటింగ్ శాతంగా రికార్డులకెక్కింది. మొత్తం 7లక్షల 81 వేల 883 మంది ఓట్లర్లకు గానూ.. 4 లక్షల 53 వేల 784 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో నగరంలోని 64 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్​గా నమోదయ్యింది.

ఇదీ చదవండి:

స్ట్రాంగ్ రూం తాళాలపై సొంత సీల్ వేసుకునేందుకు పార్టీలకు అనుమతి: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.