ETV Bharat / crime

అంతుచిక్కని వ్యాధితో భార్య, ఇద్దరు పిల్లల మృతి.. తట్టుకోలేక భర్త..!

author img

By

Published : Dec 31, 2022, 8:36 PM IST

Mystery deaths
అంతుచిక్కని వ్యాధి

Mystery deaths in Karimnagar : ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. అంతుచిక్కని వ్యాధితో భార్య, ఇద్దరు పిల్లలు ఇటీవల చనిపోగా.. ఆ విషాదం నుంచి తేరుకోలేక భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పటికే చనిపోయిన ముగ్గురి మృతికి కారణమేంటో తెలియక ఆవేదన చెందుతున్న ఆ కుటుంబంలో మరో చావుతో విషాదఛాయలు అలుముకున్నాయి.

Mystery deaths in Karimnagar : ఓ కుటుంబంలో వరుస మరణాలు సంభవించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. తీవ్ర విషాదం నింపుతోంది. ఈ అంతుచిక్కని వ్యాధితో ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు మరణించగా.. తాజాగా భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్​ జిల్లా గంగాధర మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్‌-మమతలు భార్యాభర్తలు. తెలంగాణలోని కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం తాలూకాలో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఎంతో సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో ఒక్కసారిగా తెలియని అలజడి మొదలైంది. అంతుచిక్కని వ్యాధితో మమత, ఇద్దరు పిల్లలు రెండు నెలల క్రితం మరణించారు. ఈ విషాదంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్​.. ఈరోజు ఉదయం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం రెండు నెలల వ్యవధిలో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

అయితే శ్రీకాంత్ మృతికి వారి అత్తవారింటి వేధింపులే కారణమని.. ఆ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.