ETV Bharat / crime

సేవలంటూ... దండుకుంటూ..!

author img

By

Published : Jul 16, 2021, 12:15 PM IST

frauds in aadhar changes at vishaka district
frauds in aadhar changes at vishaka district

ప్రభుత్వ పథకాలకు, పలు అవసరాలకు ఆధార్‌ తప్పనిసరైంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు వివిధ రకాల మార్పులు, చేర్పులకు అధిక సంఖ్యలో ప్రజలు ఈ-సేవా కేంద్రాల మీద ఆధారపడుతున్నారు. జిల్లాలో పరిమితంగా ఈ కేంద్రాలు ఉండడంతో ఎక్కడికక్కడ బారులు తీరుతున్నారు. ఇదే అదనుగా కొందరు నిర్వాహకులు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని అడ్డదారులు తొక్కుతున్నారు. అధికంగా డబ్బులు వసూలు చేస్తూ సామాన్యులను మోసం చేస్తున్నారు. మరో వైపు నిర్ణీత ధరలను మించి గుంజేస్తుండటంతో దరఖాస్తుదారులు అవాక్కవుతున్నారు.

గాజువాకలోని ఇంటర్నెట్‌ సెంటర్‌ వద్ద డబ్బులు తీసుకొని వివరాలు నమోదు చేస్తూ...(దాచిన చిత్రం)

ప్రస్తుతం విశాఖలో 60 వరకు కేంద్రాలు ఆధార్‌ సేవలు అందిస్తున్నాయి. అనుమతించిన బ్యాంకులు, పోస్టాఫీసులు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఉన్న మీ-సేవ కేంద్రాలు, సీఎస్‌సీలు, ఆసుపత్రుల వద్ద ఉండే బాల ఆధార్‌ కేంద్రాల ద్వారా ఈ సేవలు అందుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు వీటిని ఆశ్రయించే క్రమంలో మధ్యవర్తులు ముందుగానే సంప్రదించి తామే ఆ పనులన్నీ త్వరగా చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో తెలిసిన వారున్నారని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.500 వరకూ లాగేస్తున్నారు.

* గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, నగరంలోని కొన్ని ఇంటర్నెట్‌ కేంద్రాలు వారు నిర్ణీత రుసుం కన్నా అధికంగా డిమాండు చేస్తున్నారు. కొన్ని రకాల సేవలు ఉచితంగా అందించాల్సి ఉన్నా ఆ విషయమే పక్కనపెట్టేశారు. రూ.50 చెల్లించాల్సిన వాటికి కూడా రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు.

మోసాలు ఇలా: ఆధార్‌ వివరాల మార్పుల కోసం ముందు స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు ఎవరైనా స్వయంగా చేసుకోవచ్ఛు తెలియని వాళ్లు ఇంటర్నెట్‌ కేంద్రాలకు వెళ్తే చేస్తారు. అసలు మోసం ఇక్కడే జరుగుతుంది. కేవలం స్లాట్‌ బుకింగ్‌కు రూ.20 తీసుకోవాలి. కానీ, రూ. 200 వరకు తీసుకుంటున్నారు. తామే ఆ పనులు చేస్తామంటూ ఇలా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.

  • ఆధార్‌ సేవా కేంద్రాల్లో కొత్తగా దరఖాస్తు చేసే వారి నుంచి ఎటువంటి రుసుం వసూలు చేయకూడదు. అయినా కొందరి నుంచి పలు కేంద్రాల్లో రూ.200 నుంచి రూ. 500 వరకు తీసుకుంటున్నారు.
  • ఆధార్‌ సేవలు పొందాలంటే ముందుగా ఎన్‌రోల్‌మెంట్‌ పత్రం నింపాలి. దీన్ని ఎక్కడైనా ఉచితంగా పొందొచ్ఛు ఇంటర్నెట్‌ సెంటర్లలో రూ.20కి అమ్ముతున్నారు.
  • అయిదేళ్లు దాటిన చిన్నారులకు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వేయించాలి. ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందించాలి. కానీ, రూ.500 వరకూ దండుకుంటున్నారు. రోజుకు వివిధ రకాల సేవల కోసం వందమంది వస్తే...వారిలో 30 మంది వీరే ఉంటారు.
  • చిరునామా మార్చాల్సిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం గజిటెడ్‌ సర్టిఫికేట్‌ జత చేయాలి. ఇలా చేయటానికి కొందరు ఏకంగా వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు. నగరంలో కొందరు వైద్యులు, ఇతర అధికారుల సంతకాలతో చేయించి సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు.
  • కేజీహెచ్‌, మరికొన్ని ఆసుపత్రుల వద్ద పుట్టిన వెంటనే పిల్లలకు ఆధార్‌ చేయించేందుకు బాల ఆధార్‌ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ఇటువంటివి నాలుగైదు, చోట్ల నడుస్తున్నాయి. వీరు ఉచితంగా సేవలందించాలి. అయినా కొందరు సొమ్ము వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇంటర్నెట్‌ కేంద్రం అడ్డాగా...

గాజువాకలోని ఓ ఇంటర్నెట్‌ కేంద్ర నిర్వాహకులు ఆధార్‌లో మార్పులు చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ కేంద్రానికి అనుమతి లేనప్పటికీ ముందుగానే ఓ బ్యాంకులో నిర్వహిస్తున్న ఆధార్‌ సేవా కేంద్రంతో మాట్లాడుకొని అడ్డదారి తొక్కుతున్నారు. ఇంటర్‌నెట్‌ సెంటర్‌ ముద్రతో ఇచ్చిన రశీదును ఆపరేటర్‌కు చూపిస్తే చేసేస్తున్నారు. ఇలా చేసినందుకు ఇంటర్నెట్‌ సెంటర్‌ నిర్వాహకుడు రూ.300 తీసుకొని...ఆధార్‌ సేవ అందించేవారికి రూ.200 ఇస్తున్నారు. దీనికోసం సెంటర్‌ బయట ఏకంగా ఒక పుస్తకం పెట్టి ఫోన్‌ నంబరు రాసుకొని వసూళ్లు చేయడం గమనార్హం. ఈ కేంద్రంలో రోజుకు 30 మంది వరకు సేవలందుకుంటారు. అనధికారికంగా వసూలు చేయడంపై ద్వారకానగర్‌లోని ప్రధాన ఆధార్‌ కేంద్రానికి సైతం ఫిర్యాదులు అందాయి.

ఫిర్యాదు చేయండి...

ధిక వసూళ్లకు పాల్పడుతున్నా, మధ్యవర్తుల ప్రమేయంతో ఆధార్‌ సేవలు చేయిస్తామన్నా...వారిని నమ్మొద్ధు వెంటనే ఫిర్యాదు చేయండి. అటువంటి కేంద్రాలపై నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆపరేటర్‌ని మార్చుతాం. మొదటిసారి ఆధార్‌ చేయించుకునే వారికి మినహా మిగిలిన అన్ని సేవలకు రూ.50 మాత్రమే రుసుం చెల్లించాలి. ఆశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఆధార్‌ సేవలకు మమ్మల్ని సంప్రదించొచ్ఛు గాజువాకలో అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. - పి.శ్రీహరి, నిర్వాహకులు, ఆధార్‌సేవా కేంద్రం, యూఐడీఏఐ

ఇదీ చదవండి:

Covid Test Kit: దేశంలోనే మొదటి కొవిడ్​ ర్యాపిడ్‌ ఎలక్ట్రానిక్‌ కిట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.