ETV Bharat / crime

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం.. తల్లి, కుమార్తె మృతి

author img

By

Published : May 5, 2022, 9:08 AM IST

Updated : May 5, 2022, 10:11 AM IST

family suicide attempt
ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న తల్లి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు

09:04 May 05

ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న తల్లి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు

Suicide Attempt: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం యలమంచిలిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు (తల్లి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు) ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో తల్లి చిన్నమ్మడు(46), కుమార్తె జాహ్నవి(17) మృతి చెందగా.. మరో కుమార్తె రజని(20), కుమారుడు వెంకటసాయి శశాంకర్(14)కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళం జీజీహెచ్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న నరసన్నపేట సీఐ తిరుపతి రావు దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: పోలవరం భూసేకరణలో భారీ అక్రమాలు.. లబోదిబోమంటున్న బాధితులు

Last Updated :May 5, 2022, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.