ETV Bharat / crime

నకిలీ వెబ్‌సైట్‌తో నిరుద్యోగులకు బురిడి.. సైబర్ నేరగాళ్లు అరెస్ట్​

author img

By

Published : Jun 30, 2022, 10:59 PM IST

Fraud with fake website: పశుసంవర్థక శాఖ పేరిట నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి దోపిడీకి పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ వెబ్‌సైట్ ద్వారా డబ్బులు కాజేస్తున్నట్లు సైబర్​ క్రైం పోలీసులు గుర్తించారు.

Fraud with fake website
Fraud with fake website

Fraud With Fake website of Animal Husbandry Dept: పశుసంవర్థక శాఖ పేరిట నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి డబ్బులు కాజేసిన సైబర్‌ నేరగాళ్ల ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నంద్యాల జిల్లాకు చెందిన రవి, మధుకుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఫోన్, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రవి, మధుకుమార్.. ముఠా పశుసంవర్థకశాఖ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌లో ల్యాబ్ టెక్నిషియన్, ఇతర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధంగా దరఖాస్తుల పేరిట ఆన్‌లైన్‌లో డబ్బులు వసూళ్లుకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: "ఆ కేసుల్లో.. రఘురామను విచారించుకోవచ్చు : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.