ETV Bharat / crime

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో దంపతుల ఆత్మహత్య.. అదే కారణమా?

author img

By

Published : Dec 1, 2022, 11:47 AM IST

COUPLE SUICIDE IN ALLURI DISTRICT
COUPLE SUICIDE IN ALLURI DISTRICT

COUPLE SUICIDE IN ALLURI DISTRICT : అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొత్తబళ్లుగూడలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

COUPLE SUICIDE AT ALLURI DISTRICT : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం కొత్త బళ్లుగూడలో విషాదం జరిగింది. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ వార్డెన్ గా పనిచేస్తున్న రాధ, ఆమె భర్త సుమన్​లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పాఠశాల ప్రాంగణంలోని ఉపాధ్యాయుల నివాస గృహంలో రాత్రి దంపతులు నిద్రించారు. ఉదయం ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో.. నిర్వాహకులు బలవంతంగా తెరిచారు . భార్యాభర్తలిద్దరూ విగతజీవులై మంచంపై పడి ఉండటాన్ని గమనించి ..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.