ETV Bharat / crime

తిరునాళ్ల ఖర్చుల్లో తేడా..కత్తులతో ఇరు వర్గాల ఘర్షణ.. నలుగురికి గాయాలు

author img

By

Published : Apr 15, 2022, 10:11 AM IST

clashes between two groups
తిరునాళ్ల ఖర్చుల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

Gharshana: ఓ దేవాలయంలో జరిగిన తిరునాళ్ల వేడుక ఖర్చుల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల ప్రజలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది.

Gharshana: బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం కప్పలవారిపాలెం పంచాయతీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రామాలయం తిరునాళ్ల ఖర్చుల విషయంలో విభేదాలు తలెత్తడంతో ఈ గొడవ జరిగింది. రెండు వర్గాల ప్రజలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: Clashes: అంబేడ్కర్​ జయంతిలో ఇరువర్గాల ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.