ETV Bharat / city

మిష‌న్ సాగ‌ర్ -6 పేరిట.. యుద్ధ నౌక జ‌లశ్వ సేవలు

author img

By

Published : Mar 16, 2021, 10:45 AM IST

Mission Sagar-6
మిష‌న్ సాగ‌ర్ -6

భారత ప్రభుత్వం కొమోర‌స్​లోని అంజౌన్​ పోర్టుకు వెయ్యి మెట్రిక్ ట‌న్నుల బియ్యాన్ని చేరవేసింది. మిష‌న్ సాగ‌ర్ - 6 పేరిట భార‌త యుద్ధ నౌక జ‌లశ్వ ద్వారా పంపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

మిష‌న్ సాగ‌ర్ - 6 పేరిట భార‌త యుద్ధ నౌక జ‌లశ్వ ద్వారా.. వెయ్యి మెట్రిక్ ట‌న్నుల బియ్యం కొమోర‌స్​లోని అంజౌన్​ పోర్టుకు చేరినట్లు నేవీ అధికారులు తెలిపారు. కొమోర‌స్ ప్రభుత్వానికి సహాయంగా భారత్​ ఈ బియ్యాన్ని అందిస్తోందని చెప్పారు. అధికారికంగా అక్క‌డ జరిగిన సమావేశంలో ఆ దేశ విదేశాంగ‌ మంత్రి డి.దేవకమల్​, నౌకా, విమాన యాన మంత్రి జె.చాన్ఫీ పాల్గొన్నారు.

భార‌త నావికాద‌ళం నుంచి జ‌లాశ్వ క‌మాండింగ్ అధికారి కెప్టెన్ పంక‌జ్ చౌహాన్ వారితో భేటీ అయ్యారు. మన దేశానికి చెందిన ఓ యుద్ధనౌక మరోదేశానికి ఏడాదిలో రెండోసారి వెళ్లింది. మిషన్​ సాగర్​-4 పేరిట భారత ప్రభుత్వం ఇది వరకే ఆ దేశానికి 1000 మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని అందించింది. గ‌తంలో మిష‌న్ సాగ‌ర్-1లో ఐఎన్ఎస్ జ‌లశ్వ కీలక పాత్ర పోషించింది.

ఇదీ చదవండి:

ఖర్గేను కలిసిన హర్షకుమార్ కుమారుడు.. 'ప్రైవేటీకరణ'పై పోరాడాలని వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.