ETV Bharat / city

'ఓ వైపు రాష్ట్రం తగలబడుతుంటే..వీడియో గేమ్ ఆటలా ?'

author img

By

Published : May 2, 2021, 3:39 PM IST

ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత చర్యలతో రాష్ట్రం శవాలకుప్పగా మారిందని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ దుయ్యబట్టారు. ఇంటింటికీ మద్యం అందిస్తున్న సీఎం.., ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ మాత్రం అందించలేకపోయారన్నారు.

tdp saptagiri comments on covid in ap
ఓ వైపు రాష్ట్రం తగలబడుతుంటే..వీడియో గేమ్ ఆటలా ?

ఇంటింటికీ మద్యం అందిస్తున్న ముఖ్యమంత్రి, ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ మాత్రం అందించలేకపోయారని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ దుయ్యబట్టారు. కరోనా మృతుల చితి మంటలతో రాష్ట్రం తగలబడుతుంటే సీఎం జగన్.. వీడియో గేములు, పబ్జీ ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అనాలోచిత చర్యలతో ఇప్పటికే రాష్ట్రం శవాలకుప్పగా మారిందన్నారు. అహంకారంతో, మొండిపట్టుదలతో పరీక్షలు పెడతానంటూ విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి: 'సీఎం గారూ..కరోనాపై ప్రజలకు వాస్తవాలు చెప్పండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.