ETV Bharat / city

27 నుంచి గుంటూరు - రాయ‌గ‌ఢ్ మధ్య ప్ర‌త్యేక రైలు

author img

By

Published : Jan 23, 2021, 7:13 AM IST

గుంటూరు - రాయ‌గ‌ఢ్ మ‌ధ్య ప్ర‌త్యేక ఎక్స్​ప్రెస్ రైలును న‌డ‌ప‌నున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈనెల 27 నుంచి ఈ రైలు ప్రయాణికులకు సేవలు అందించనుందని చెప్పారు.

Special train to Guntur - Rayagada
27 నుంచి గుంటూరు - రాయ‌గ‌డకు ప్ర‌త్యేక రైలు

ఈ నెల 27 నుంచి గుంటూరు - రాయ‌గ‌ఢ్​కు ప్ర‌త్యేక ఎక్స్​ప్రెస్​ రైలును న‌డ‌ప‌నున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. 07243 నెంబ‌ర్ గల ట్రైన్ ప్రతిరోజూ గుంటూరులో రాత్రి 11.20 గంట‌ల‌కు బ‌య‌లుదేరి.. మ‌ర‌స‌టి రోజు ఉద‌యం 8.45 గంట‌ల‌కు విశాఖ‌ చేరుతుంది. అక్కడి నుంచి 9.05 గంటలకు బ‌య‌లుదేరి.. మ‌ధ్యాహ్నం 1.40 గంటలకు రాయ‌గ‌ఢ్ చేరుకుంటుంది.

తిరుగు ప్ర‌యాణంలో ఈ రైలు 07244 నెంబ‌ర్​తో మ‌ధ్యాహ్నం 2.50 గంట‌లకు రాయ‌గ‌డ‌లో బ‌య‌లుదేరి.. సాయంత్రం 7.15 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 7.35 గంట‌లకు బ‌య‌లుదేరి మ‌రుస‌టి రోజు తెల్ల‌వారుజామున 4.15 గంట‌లకు గుంటూరు చేరుకుంటుంది.

మంగ‌ళ‌గిరి, విజ‌య‌వాడ‌, నూజివీడు, ఏలూరు, భీమ‌డోలు, తాడేప‌ల్లిగూడెం, నిద‌డ‌వోలు, రాజ‌మండ్రి, ద్వార‌పూడి, అన‌ప‌ర్తి, సామ‌ర్ల‌కోట‌, పిఠాపురం, అన్న‌వ‌రం, తుని, న‌ర్సీప‌ట్నం రోడ్, ఎల‌మంచిలి, అన‌కాప‌ల్లి, దువ్వాడ‌, విశాఖ‌, సింహాచ‌లం, విజ‌య‌వ‌న‌గ‌రం, గ‌జ‌ప‌తి న‌గ‌రం, కొమ‌టిప‌ల్లి, డొంకిన‌వ‌ల‌స‌, బొబ్బిలి, సీతానగ‌రం, పార్వ‌తీపురం, పార్వ‌తీపురంటౌన్​లలో ఈ రైలుకు స్టాపులు ఉన్నాయి.

ఇదీ చదవండి:

కంచరపాలెం పీఎస్‌ సమీపంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.