ETV Bharat / city

అప్పన్నను దర్శించుకున్న మంత్రి అవంతి

author img

By

Published : Feb 13, 2021, 7:09 PM IST

Minister Avanti srinivas
అప్పన్నను దర్శించుకున్న మంత్రి అవంతి

రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు సింహాద్రి అప్పన్న దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి ఆలయ మర్యాదల ప్రకారం అధికారులు స్వాగతం పలికారు.


విశాఖ జిల్లా సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కప్ప స్తంభానికి మొక్కులు చెల్లించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా.. ఆలయ అధికారులు.. మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సింహాచలం బోర్డ్ సభ్యులు, స్థానిక నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...: కొనసాగుతున్న 'పల్లా' ఆమరణ దీక్ష... ఉడుకుతున్న 'ఉక్కు' నగరం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.