ETV Bharat / city

విశాఖలో 'ప్రసాదం' పథకంపై కేంద్ర పర్యాటక కమిటీ సభ్యుల సమావేశం

author img

By

Published : Aug 13, 2021, 11:14 AM IST

Updated : Aug 13, 2021, 12:58 PM IST

ప్రసాదం పథకంపై కేంద్ర పర్యాటక కమిటీ సభ్యులు విశాఖలోని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంట్లో సమావేశమయ్యారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయ కార్యదర్శి ఎస్.ఎస్. వర్మ నేతృత్వంలో బృందం ప్రసాదం పథకంపై చర్చలు జరుపుతోంది.

మంత్రితో సమావేశమైన అధికారులు
మంత్రితో సమావేశమైన అధికారులు

ప్రసాదం పథకంపై కేంద్ర పర్యాటక కమిటీ సభ్యులు విశాఖలోని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంట్లో సమావేశమయ్యారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయ కార్యదర్శి ఎస్.ఎస్. వర్మ నేతృత్వంలో బృందం ప్రసాదం పథకంపై చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ..సింహాచలం మెట్ల మార్గం పనులు మధ్యలో ఆగిపోయాయని వెల్లడించారు. మాధవధార వైపు ఉన్న మెట్ల మార్గం వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

ఆలయంలో యజ్ఞశాల నిర్మాణం తలపెట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. భక్తుల కోసం వెయిటింగ్ హాల్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న మంత్రి.. గిరి ప్రదక్షిణ కోసం ట్రాక్ ఏర్పాటునకు ఆలోచిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర బృందాన్ని పంపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి...ముత్తంశెట్టి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అన్నవరం, విజయవాడ, చిన్నతిరుపతి దేవాలయాలకు ఈ పథకం వర్తించేలా కమిటీని కోరినట్లు ఆయన చెప్పారు.

కేంద్ర పర్యాటక శాఖ సహాయ కార్యదర్శి ఎస్.ఎస్. వర్మ మాట్లాడుతూ..ప్రసాదం పథకాన్ని పర్యాటక శాఖ పర్యవేక్షిస్తోందని తెలిపారు. మెుదట తమ బృందం ఆలయాన్ని పరిశీలిస్తోందన్న ఆయన..పరిశీలన పూర్తయ్యాక డీపీఆర్ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

సెన్సెక్స్​ నయా రికార్డ్​: 55వేల మార్క్​ను దాటిన సూచీ

Last Updated : Aug 13, 2021, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.