అమరావతి ప్రజలను రెచ్చగొట్టి తెదేపా అధినేత చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందుతున్నారని... మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. విశాఖ మధురవాడలోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను మంత్రి అవంతి ప్రారంభించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై ఆయన విమర్శలు గుప్పించారు. అమరావతి రైతులకు సీఎం జగన్ కచ్చితంగా న్యాయం చేస్తారని అవంతి పేర్కొన్నారు.