ETV Bharat / city

దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ కేశినేని నాని

author img

By

Published : Oct 21, 2020, 11:50 AM IST

vijayawada mp kesineni nani visits indrakeeladri durga temple
దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ కేశినేని నాని

సరస్వతీ దేవీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మను... విజయవాడ ఎంపీ కేశినేని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని వేడుకున్నట్లు ఎంపీ తెలిపారు.

మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మను విజయవాడ ఎంపీ కేశినేని నానీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సరస్వతీ దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

సామాన్యులకు దొరకని దుర్గమ్మ దర్శనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.