ETV Bharat / city

TSRTC Offer: టికెట్​కు చిల్లర లేదా? నో టెన్షన్​.. ఇక అలా చెల్లించొచ్చు!!

author img

By

Published : Jun 18, 2022, 10:40 AM IST

TSRTC Latest News
టీఎస్‌ఆర్టీసీ సరికొత్త సాంకేతికత

TSRTC News: ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి టీఎస్‌ఆర్టీసీ సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. టికెట్ల జారీని మరింత సులభతరం చేసేందుకు ఇపుడు మరింత ఆధునికంగా.. దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఫాదర్స్‌ డే సందర్భంగా ఆదివారం(19న) తెలంగాణ ఆర్టీసీలో చిన్నారుల తండ్రులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించినట్లు ఆ సంస్థ ఛైర్మన్‌, ఎండీ తెలిపారు.

TSRTC News: నష్టాల నుంచి తెరకక్కడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న టీఎస్‌ఆర్టీసీ.. ఓవైపు లాభాల బాట పట్టేందుకు కృషి చేస్తూనే.. మరోవైపు వినూత్న ఆఫర్‌లు ప్రకటిస్తోంది. అదిలా ఉంటే ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి తెలంగాణ ఆర్టీసీ సరికొత్త సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి టీఎస్‌ఆర్టీసీ సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. టికెట్ల జారీని మరింత సులభతరం చేసేందుకు ఇప్పటికే టిమ్‌ (టికెట్‌ ఇష్యూ మిషన్‌) సేవలను అందిస్తోంది. ఇపుడు మరింత ఆధునికంగా.. దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్‌(ఇంటెలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌)లను అందుబాటులోకి తెచ్చింది.

ఇదీ ప్రయోజనం.. ప్రయాణానికి 20 నిమిషాల ముందు సీట్ల అందుబాటును బట్టి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ చేసుకోచ్చు. బస్సు ఎక్కడ ఉంది, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, మన స్టేజీకి రావడానికి ఎంత సమయం పడుతుంది.. వంటి వివరాలన్నీ ఐ-టిమ్‌ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను స్వైప్‌ చేయడం, గూగుల్‌ పే, ఫోన్‌పే ద్వారా కూడా టికెట్‌ ఛార్జీలు చెల్లించడానికి వెసులుబాటు లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవల కోసం ఆర్టీసీ ఇప్పటికే 928 ఐ-టిమ్‌లు కొన్నట్లు సమాచారం.

మొదట ఏసీ బస్సుల్లో.. ఐ-టిమ్‌లను ముందుగా దూరప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే వీటిని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్‌ బస్సుల్లో అందుబాటులోకి తెచ్చారు. అనంతరం దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో అమలుచేసి, దశలవారీగా అన్ని సర్వీసుల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. వచ్చేనెలలో కరీంనగర్‌ రీజియన్‌లో గరుడ, గరుడప్లస్‌, రాజధాని, ఇంద్ర లాంటి సర్వీసుల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు కరీంనగర్‌ ఆర్‌ఎం ఖుస్రోషాఖాన్‌ తెలిపారు.

ఫాదర్స్‌ డే సందర్భంగా ఉచితప్రయాణం.. ఫాదర్స్‌ డే సందర్భంగా ఆదివారం(19న) తెలంగాణ ఆర్టీసీలో చిన్నారుల తండ్రులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించినట్లు ఆ సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ అయిదేళ్ల వయసు ఉన్న చిన్నారులతో కలిసి తండ్రులు ఆ రోజున ఆర్టీసీకి చెందిన బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.