ETV Bharat / city

TRICOLOUR LIGHTING: స్వాతంత్య్ర దినోత్సవానికి.. విద్యుత్​ దీపాలతో భవనాల ముస్తాబు

author img

By

Published : Aug 14, 2021, 9:03 PM IST

Updated : Aug 14, 2021, 11:19 PM IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ, అమరావతి లోని ప్రభుత్వ భవనాలు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు ప్రధాన రహదారులను విద్యుత్​ దీపాలతో అలంకరించారు. మువ్వన్నెల జెండా రంగుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

విద్యుత్​ దీపాలతో భవనాల ముస్తాబు
విద్యుత్​ దీపాలతో భవనాల ముస్తాబు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం, హైకోర్టు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ భవనాలు, రహదారులు త్రివర్ణ పతాక రంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబయ్యాయి.

స్వాతంత్య్ర దినోత్సవానికి.. విద్యుత్​ దీపాలతో భవనాల ముస్తాబు

విజయవాడలోని రాజ్ భవన్​ తో పాటు బందరు రోడ్డు మెుత్తం విద్యుత్ దీపాలు, ఎల్​ఈడీ దీపాలతో అలంకరించటంతో నగరవాసులను ఆకట్టకుంటున్నాయి. రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలను మువ్వన్నెల జెండాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యమైన బహిరంగ ప్రదేశాలు, చారిత్రక కట్టడాల వద్ద కూడా అలంకరణ చేశారు. ఆజాదీగా అమృత్ మహోత్సవ్​లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను మువ్వన్నెల జెండాలతో తీర్చిదిద్దారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయ ప్రాంగణం మూడు రంగుల విద్యుత్ దీపకాంతులతో వెలుగులీనుతోంది. ప్రాంగణంలోని ఐదు బ్లాక్ లతో పాటు అదే ఆవరణలో ఉన్న శాసనసభ, మండలి భవనాలను కూడా సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు.

జెండా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఆ తరువాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. కరోనా కారణంగా కొవిడ్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రస్థాయిలో జరగనున్న వేడుకలకు పరిమిత సంఖ్యలోనే అతిథుల్ని ఆహ్వానించారు.

ఇదీ చదవండి:

Pawan Kalyan: ప్రజలకు వజ్రోత్సవ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

Last Updated : Aug 14, 2021, 11:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.