పోస్కో సంస్థ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలనుకుంటే విశాఖలో కాకుండా కడపలో ఏర్పాటు చేసేలా సీఎం జగన్ చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పోస్కో సంస్థకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వామపక్షాలు 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది తమ భూములను త్యాగం చేసిన ఫలితమే విశాఖ ఉక్కు కర్మాగారమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 23న కార్మిక సంఘాలతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: