ETV Bharat / city

అధికారంలోకి రాగానే.. ఒకే సంతకంతో.. : అచ్చెన్నాయుడు

author img

By

Published : May 27, 2022, 12:45 PM IST

ATCHANNA: చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైకాపా లాగా.. తెదేపా గాలికి పుట్టిన పార్టీ కాదన్న అచ్చెన్న.. ప్రజల మనస్సుల్లో నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు.

ATCHANNA
చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారం

ATCHANNA: మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సీఎం జగన్‌ సర్వ నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో.. తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీ కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులను ఒకే సంతకంతో తీసేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారమని అని తెలిపారు. వైకాపా చేపడుతోన్న బస్సుయాత్రలో వస్తోంది మంత్రులు కాదని.. బస్సు యాత్ర పేరుతో అలీబాబా దొంగలు వస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారం

చంద్రబాబును సీఎం చేయడానికి కార్యకర్తలు శపథం చేయాలన్నారు. అధికారం ఉన్నా.. లేకున్నా ప్రజల కోసమే తెదేపా రాజకీయం చేస్తోందని తెలిపారు. గత మూడేళ్లుగా చంద్రబాబు మొదలుకుని.. సాధారణ కార్యకర్త వరకు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వైకాపా లాగా.. తెదేపా గాలికి పుట్టిన పార్టీ కాదని.. ప్రజల మనసులో నుంచి పుట్టిన పార్టీ అని తెలిపారు. తెదేపాని లేకుండా చేయడం జగన్ తాత, తండ్రి వల్ల కూడా కాలేదని వెల్లడించారు. రోడ్డెక్కడానికి భయపడే పరిస్థితి నుంచి రోడ్డెక్కి పోరాటం చేసే స్థితికి కార్యకర్తలు చేరారన్నారు. చంద్రబాబు ప్రజల్లోకి రాగానే రాష్ట్రం షేక్ అయిందని.. ఉత్తరాంధ్రలోనే కాదు.. చంద్రబాబు కడప వెళ్తే ఆ జిల్లానే దద్దరిల్లిందన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.