ETV Bharat / city

'మహిళలపై దాడులు, అఘాయిత్యాల్లో సగం వాలంటీర్ల పనే'

author img

By

Published : Jun 30, 2021, 9:22 PM IST

disha app
దిశ యాప్

రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులు, అఘాయిత్యాల్లో సగం వాలంటీర్లు చేసినవే అని.. దిశ యాప్ డౌన్​లోడ్​ బాధ్యత వాలంటీర్లకు అప్పగించి ఆడబిడ్డలను ఇంకా బలిచేద్దాం అనుకుంటున్నారా..? అని తెదేపా మహిళా అధ్యక్షురాలు ప్రశ్నించారు. శిక్షణ పొందిన పోలీసులతో భద్రత కల్పించకుండా మహిళా మిత్రులకు పోలీసు దుస్తులు ఇవ్వడం వల్ల ఎం ఉపయోగమన్నారు.

'రాష్ట్రానికి ఓ మహిళ.. ముఖ్యమంత్రిగా రానున్నారని ముఖ్యమంత్రి జగన్ మాటల ద్వారా స్పష్టమైంది. కాబోయే ఆ మహిళా ముఖ్యమంత్రి ఎవరు' అని తెదేపా మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. తాడేపల్లిలో ఆయనతోపాటు ఉంటున్నారా.. లేక హైదరాబాద్​లో ఉంటున్నారా అని మీడియా సమావేశంలో అన్నారు.

రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులు, అఘాయిత్యాల్లో సగం సీఎం జగన్​ నియమించిన వాలంటీర్లు చేసినవే. ఇప్పుడు దిశ యాప్ డౌన్​లోడ్​ బాధ్యత వాలంటీర్లకు అప్పగించి ఆడబిడ్డలను ఇంకా బలిచేద్దాం అనుకుంటున్నారా. శిక్షణ పొందిన పోలీసులతో భద్రత కల్పించకుండా మహిళా మిత్రులకు పోలీసు దుస్తులు ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం' అని అనిత మండిపడ్డారు.

కాపీ పేస్ట్ విధానాన్ని దిశా యాప్​గా చెప్పుకుంటున్నారని.. సాధన దీక్షను ఎమార్చడానికే ఫేక్ కార్యక్రమం నిర్వహించారని ఆరోపించారు. ఇకనైనా అభూత కల్పనలతో మహిళలను మోసం చేసే ప్రక్రియకు ముగింపు చెప్పకుంటే వారు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

ఇదీ చదవండి..

Jagan Cabinet Decisions: విద్యార్థులకు ల్యాప్​టాప్​లు.. ఇళ్ల నిర్మాణాలకు భారీగా నిధులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.