ETV Bharat / city

RTC EX GRATIA: బస్సు ప్రమాద మృతులకు ఆర్టీసీ తరఫున రూ.2.5 లక్షల పరిహారం: ఎండీ

author img

By

Published : Dec 15, 2021, 7:37 PM IST

Updated : Dec 17, 2021, 4:49 PM IST

RTC EX GRATIA: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆర్టీసీ పరిహారాన్ని ప్రకటించింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

RTC EX GRATIA
RTC EX GRATIA

RTC EX GRATIA TO DECEASED IN BUS ACCIDENT: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పరిధిలోని జల్లేరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆర్టీసీ తరఫున రూ. 2.5 లక్షల పరిహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన బస్సును 2019లో కొన్నామని.. బస్సు పూర్తి ఫిట్‌నెస్‌తోనే ఉందని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో ఆ మార్గంలో బస్సుకు ఎదురుగా మరే ఇతర వాహనాలు రాలేదని ఆయన అన్నారు.

ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను.. జంగారెడ్డిగూడెం ఆస్పత్రిలో ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున్‌రెడ్డి, ఎండీ ద్వారకాతిరుమలరావు పరామర్శించారు. ప్రమాదంపై ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందిస్తామని ఆర్టీసీ ఎండీ తెలిపారు.

సంబంధిత కథనాలు చదవండి:

Bus accident: ఘోర ప్రమాదం..వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి

Rs. 5 LAKHS EX GRATIA: బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల పరిహారం

CONDOLENCES ON BUS ACCIDENT: బస్సు ప్రమాదంపై నేతల తీవ్ర దిగ్భ్రాంతి.. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

Last Updated : Dec 17, 2021, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.