ETV Bharat / city

'కోట్ల రూపాయల అవినీతికి పాల్పడితే బదిలీతో సరిపెట్టుకుంటారా..?'

author img

By

Published : Feb 25, 2021, 3:58 PM IST

దుర్గ గుడిలో 16 మంది ఉద్యోగులను బలితీసుకున్న ఈవోను సస్పెండ్ చేయకుండా... బదిలీ చేసి చేతులు దులుపుకుంటారా..? అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈవో సురేశ్ బాబు మంత్రి వెల్లంపల్లి బినామీ అని.. వీరికి ఒక స్వామీజీ ఆశీస్సులతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జలతో ప్యాకేజీ మాట్లాడుకున్నారని ఆరోపించారు.

కోట్ల రూపాయల అవినీతి పాల్పడితే బదిలీతో సరిపెట్టుకుంటారా?
కోట్ల రూపాయల అవినీతి పాల్పడితే బదిలీతో సరిపెట్టుకుంటారా?

విజయవాడ దుర్గగుడిలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన ఈవో సురేశ్ బాబును సస్పెండ్ చేయకుండా బదిలీ చేయటం దుర్మార్గమని... జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శించారు. 16 మంది ఉద్యోగులను బలితీసుకున్న ఈవోను బదిలీ చేసి చేతులు దులుపుకుంటారా..? అని ప్రశ్నించారు. ఈవో సురేశ్ బాబు మంత్రి వెల్లంపల్లి బినామీ అని.. వీరికి ఒక స్వామీజీ ఆశీస్సులతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జలతో ప్యాకేజీ మాట్లాడుకున్నారని ఆరోపించారు.

మంత్రిగా వెల్లంపల్లి ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి నేటి వరకు ప్రభుత్వం అన్ని దస్త్రాలను పరిశీలించి మంత్రి అవినీతిని బహిర్గతం చేయాలన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన మంత్రి వెల్లపల్లిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి...

ఆన్​లైన్​లో మార్చి నెల తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.