ETV Bharat / city

'వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి...వీరికి సొంతంగా పరిహారమివ్వాలి'

author img

By

Published : Mar 4, 2022, 12:12 PM IST

Panchumarthi anuradha: అమరావతి రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పంచుమర్తి అనురాధ డిమాండ్​ చేశారు. అమరావతి మహిళలకు సీఎం జగన్​ క్షమాపణ చెప్పాలన్నారు.

Panchumarthi anuradha
పంచుమర్తి అనురాధ

Panchumarthi anuradha: అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండ్‌ చేశారు. అమరావతి రాజధాని అనేది మహిళ రైతుల విజయమని చెప్పారు. కోర్టు తీర్పును అడ్డుకోవాలని చుస్తే వైకాపా నేతలను మహిళలే కొడతారని హెచ్చరించారు.

అమరావతి మహిళలకు సీఎం బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. అమరులైన రైతులకు సీఎం జగన్ సొంత జేబు నుంచి ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

amaravati : కర్షకులే కథానాయకులై.. అతివలే ఆదిపరాశక్తులై... అలుపెరుగని పోరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.