ETV Bharat / city

Corona cases in Andhra Pradesh : రాష్ట్రంలో కొత్తగా 184 కరోనా కేసులు, ఒకరు మృతి

author img

By

Published : Nov 26, 2021, 6:19 PM IST

రాష్ట్రంలో కొత్తగా 184 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,163 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 29,731 మందికి కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 184 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు వైరస్ కారణంగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. కరోనా నుంచి మరో 214మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,163 కొవిడ్ యాక్టివ్ కేసులు(Corona active cases in Andhra Pradesh) ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు..
అనంతపురంలో 4, చిత్తూరులో 36, తూర్పుగోదావరిలో 11, గుంటూరులో 18, కడపలో 2, కృష్ణాలో 34, నెల్లూరులో 13, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 16, విజయనగరంలో 3, పశ్చిమగోదావరిలో 30 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కేసూ నమోదు కాలేదు.

ఇవీచదవండి.

Rain alert in Andhra Pradesh: రాష్ట్రానికి మరోసారి వాన గండం.. వాతావరణ శాఖ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.