ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 6,361 కేసులు... 51 మరణాలు

author img

By

Published : May 5, 2021, 10:06 AM IST

తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కొత్తగా 6,361 కొవిడ్ కేసులు నమోదు కాగా... 51 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77 వేలకు పైగా క్రియాశీల కేసులున్నాయి.

ts corona cases
తెలంగాణలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 6,361 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో 51 మంది మరణించారు. వైరస్‌ నుంచి కోలుకుని 8,126 మంది డిశ్చార్జ్​ అయ్యారు.

ప్రస్తుతం 77,704 క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న 77,435 పరీక్షలు నిర్వహించగా...జీహెచ్​ఎంసీ పరిధిలో 1,225 కేసులు వెలుగు చూశాయి. మేడ్చల్‌ జిల్లాలో 422, రంగారెడ్డి జిల్లాలో 423 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి:

నేటి నుంచే కర్ఫ్యూ అమలు.. వాటికి మాత్రమే మినహాయింపు

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.