ETV Bharat / city

'ఇంటిదగ్గరే యువతికి అన్యాయం జరిగితే.. సీఎం ఎక్కడున్నారు?'

author img

By

Published : Jun 21, 2021, 11:29 AM IST

"రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్న జగన్ రెడ్డి.. తన ఇంటి సమీపంలో ఓ యువతికి అన్యాయం జరిగితే ఏమయ్యారు?" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. జనం తిరగబడతారనే భయంతో రెండేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ లో హోం ఐసోలేషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు.

nara lokesh
nara lokesh

"తన ప్యాలెస్​కు కూతవేటు దూరంలో ఒక యువతిని దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారనే సమాచారమైనా ముఖ్యమంత్రికి తెలుసా?" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. అమ్మాయికి అన్యాయం జరిగితే గన్ కంటే జగన్ ముందొస్తాడంటూ చెప్పిన పంచ్ డైలాగులు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ఇంటి దగ్గర ఇంత అన్యాయం జరిగుతుంటే ఆయన ఎక్కడున్నారని ధ్వజమెత్తారు. అమరావతి ఉద్యమానికి భయపడి వేలమంది పోలీసుల్ని కాపలా పెట్టుకున్నారని.. జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకమైందని లోకేశ్ దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

AYUSH KIT: ఆయుష్‌ కుటుంబ సంరక్షణ కిట్‌ పంపిణీ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.