విజయవాడలో ఆర్టీసీ బస్సుల కోసం విద్యార్థుల అవస్థలపై మంత్రి పేర్ని నాని అధికారులతో చర్చించారు. ప్రత్యేక బస్సులు నడపాలని ఆదేశించారు. 5 ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు నిర్ణయించారు. ఎలక్ట్రిక్ బస్సుల ధరలు తగ్గితే కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియోపై కరోనా ప్రభావం లేదని పేర్ని నాని చెప్పారు. దూరప్రాంత బస్సుల్లో 77 శాతం, సిటీ బస్సుల్లో 68 శాతం ఓఆర్ ఉందన్నారు.
ఇదీ చదవండి: