ETV Bharat / city

Murder: కారుతో ఢీకొట్టి వ్యక్తి హత్య..! ఎక్కడంటే..?

author img

By

Published : Oct 9, 2022, 1:14 PM IST

Murder: విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్‌ పరిధిలో దేశీ సురేశ్‌ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నామని మాచవరం పోలీసులు తెలిపారు.

Murder
కారుతో ఢీకొట్టి వ్యక్తి హత్య

Murder: విజయవాడ మాచవరం పోలిస్​స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తిని హత్య చేయడం కలకలం రేపింది. మొగల్‌రాజ్ పురం అమ్మ కళ్యాణ మండపం నుంచి క్రీస్తురాజు పురం వెళ్తూ దేశీ సురేశ్ అనే వ్యక్తిని కంకణాల చౌడేష్​ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దేశి సురేష్, కంకణాల చౌడేష్ మధ్య గత కొంత కాలం నుంచి గొడవలున్నాయని తెలిపారు. మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.