ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా కల్లోలం..8,987 కేసులు, 35 మరణాలు

author img

By

Published : Apr 20, 2021, 5:24 PM IST

Updated : Apr 20, 2021, 5:53 PM IST

latest corona cases in ap
కరోనా హెల్త్ బులిటెన్

17:22 April 20

ఏపీలో తాజా కరోనా కేసులు

latest corona cases in ap
కరోనా హెల్త్ బులిటెన్

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 37,922 పరీక్షలు నిర్వహించారు. 8,987 కేసులు నిర్ధరణ కాగా 35 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 3,116 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53,889 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.  

జిల్లాల వారీగా కేసులు..

గడచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 1,347 కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం 1,344, గుంటూరు 1,202, చిత్తూరు 1,063, తూర్పుగోదావరి 851, కర్నూలు 758, విశాఖ 675, కృష్ణా 441, విజయనగరం 330, ప్రకాశం 305 చొప్పున కేసులు నమోదయ్యాయి.  

జిల్లాల వారీగా మరణాలు..  

గత 24 గంటల వ్యవధిలో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ఎనిమిది మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. చిత్తూరు 5, కడప 5, అనంతపురం 3, కృష్ణా 3, శ్రీకాకుళం 3, ప్రకాశం 2, కర్నూలు 2, గుంటూరు 1, విశాఖ 1, విజయనగరం 1, తూర్పుగోదావరి 1 చొప్పున ప్రాణాలు విడిచారు.    

ఇదీచదవండి

కోవిడ్ నియంత్రణ: మాస్కు లేకుంటే జరిమానే

Last Updated : Apr 20, 2021, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.