ETV Bharat / city

Petitions Withdrawn: జగన్ అక్రమాస్తుల కేసు.. క్వాష్ పిటిషన్ల ఉపసంహరణ!

author img

By

Published : Dec 20, 2021, 9:57 PM IST

Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను మరో ఇద్దరు నిందితులు ఉపసంహరించుకున్నారు. పారిశ్రామికవేత్త శ్యాంప్రసాద్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య తమ పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. అయిదేళ్ల పాటు స్టే కొనసాగిన తర్వాత.. తీరా విచారణకు వచ్చిన సమయంలో పిటిషన్లు ఉపసంహరించుకున్నారు.

క్వాష్ పిటిషన్లు ఉపసంహరణ
క్వాష్ పిటిషన్లు ఉపసంహరణ

Petitions Withdrawn On Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించాలంటూ అయిదేళ్ల క్రితం దాఖలు చేసిన పిటిషన్లను మరో ఇద్దరు నిందితులు ఉపసంహరించుకున్నారు. ఇటీవల దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా తన పిటిషన్​ వెనక్కి తీసుకోగా.. ఇవాళ ఇందూ టెక్ జోన్, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసుల్లో ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, ఇందూ టెక్ జోన్ ఛార్జ్​షీట్​లో నిందితుడిగా ఉన్న బీపీ ఆచార్య క్వాష్ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు.

అయిదేళ్ల క్రితం దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వద్ద ఇవాళ విచారణకు వచ్చాయి. వాదనలు వినిపించాల్సిన సమయం రాగానే.. క్వాష్ పిటిషన్లు వెనక్కి తీసుకునేందుకు నిందితుల తరఫు న్యాయవాది అనుమతి కోరారు. అయిదేళ్ల పాటు స్టే కొనసాగిన తర్వాత.. విచారణకు రాగానే వెనక్కి తీసుకోవటం పట్ల సీబీఐ తరఫు న్యాయవాది సురేంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ వెనక్కి తీసుకొని సీబీఐ కోర్టులో కొత్త వివాదం లేవనెత్తి.. మళ్లీ అక్కడ కాలయాపన మొదలు పెడతారని వాదించారు. నిందితుల క్వాష్ పిటిషన్ల ఉపసంహరణకు అనుమతిచ్చిన హైకోర్టు.. మళ్లీ పిటిషన్లు దాఖలు చేస్తే వీలైనంత త్వరగా విచారణ ముగించాలని సీబీఐ కోర్టును ఆదేశించింది.

పెన్నా సిమెంట్స్ కేసులో గనుల శాఖ మాజీ సంచాలకుడు వీడీ రాజగోపాల్ క్వాష్ పిటిషన్​పై వాదనలు విన్న టీఎస్ హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. విశ్రాంత ఉద్యోగులకు ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకోవాలన్న అవినీతి నిరోధక చట్టం సవరణను సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ తరఫు న్యాయవాది వాదించింది. గతంలో ఓబుళాపురం గనుల కేసులో ఇదే వాదనతో రాజగోపాల్ దాఖలు చేసిన పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును వాయిదా వేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు నుంచి తొలగించాలని కోరుతూ ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్​పై ఇవాళ వాదనలు విన్న హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి

AP Govt On DA: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.