ETV Bharat / city

దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుక‌లు కాజేసిన వ్యక్తి గుర్తింపు

author img

By

Published : May 14, 2022, 4:35 AM IST

విజయవాడ దుర్గగుడిలో హుండీల లెక్కింపులో కానుక‌లు కాజేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దేవ‌స్థానానికి చెందిన ఓ ఉద్యోగే ఆ కానుకలను దొంగిలించినట్లు నిర్ధరించారు.

ornaments stolen in durga temple
దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుక‌లు కాజేసిన వ్యక్తి గుర్తింపు

Durga Temple News: విజయవాడ దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుక‌లు కాజేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దేవ‌స్థానానికి చెందిన ఓ చిరుద్యోగే ఈ ప‌ని చేసిన‌ట్టు నిర్ధరించారు. కొద్ది రోజుల కిందట మ‌హామండ‌పం ఆరో అంత‌స్తులోని బాత్‌రూంలో ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల ప్యాకెట్‌ను ఎస్​పీఎఫ్​ సిబ్బంది గుర్తించారు. ఈవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వ‌న్‌టౌన్ పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 110మంది సేవ‌కులు, ఉద్యోగులు లెక్కింపులో పాల్గొన్నారని తెలిపారు. నిందితుడి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: చోరీలు చేయడంలో ఈ దొంగ రూటే సెపరేటు.. మీరే చూడండి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.