ETV Bharat / city

సీఎం​ను తప్పుగా చూపించే కుట్ర జరుగుతోంది: హీరో రామ్

author img

By

Published : Aug 15, 2020, 3:06 PM IST

విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై కథానాయకుడు రామ్ స్పందించారు. సీఎం జగన్​ను తప్పుగా చూపించేందుకు పెద్ద కుట్ర జరుగుతున్నట్లుందని రామ్ అన్నారు. అందరినీ ఫూల్స్​ని చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారన్నారు. ఈ మేరకు పలు ట్వీట్స్ చేశారు.

hero ram respond on vijayawada swarna palace fire accident incident
హీరో రామ్

విజయవాడలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై కథానాయకుడు రామ్ స్పందించారు. దీనిపై రమేష్ ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణలపై వ్యాఖ్యానించారు.

హోటల్ స్వర్ణ ప్యాలెస్​ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కొవిడ్ సెంటర్​గా మార్చక ముందు ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించిందని రామ్ అన్నారు. అప్పుడు అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లని ట్విట్టర్​లో ప్రశ్నించారు.

ram tweets
రామ్ ట్వీట్స్

సీఎం జగన్​ను తప్పుగా చూపించేందుకు పెద్ద కుట్ర జరుగుతున్నట్లుందని రామ్ అన్నారు. ముఖ్యమంత్రి కింద పనిచేసే కొంతమంది సీఎంకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల ఆయన రెప్యుటేషన్, సీఎం మీద తాము పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ జరుగుతోందంటూ ట్విట్టర్​లో వ్యాఖ్యానించారు. వారి మీద ఓ కన్నేసి ఉంచాలని సీఎంకు సూచించారు.

ram tweets
రామ్ ట్వీట్స్

అందరినీ ఫూల్స్​ని చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారని అన్నారు. మేనేజ్‌మెంట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ‌ప్యాలెస్‌ డైరెక్ట్​గా బిల్లింగ్ చేసిన ఫీజు వివరాలను ట్విట్టర్​లో ప్రదర్శించారు.

ram tweets
రామ్ ట్వీట్స్

ఇవీ చదవండి...

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.