ETV Bharat / city

Gujarth RTC Team in AP: రాష్ట్రానికి గుజరాత్ ఆర్టీసీ బృందం.. పండిట్ నెహ్రు బస్​స్టేషన్​ పరిశీలన

author img

By

Published : Dec 7, 2021, 7:56 PM IST

Gujarth RTC Team in AP
Gujarth RTC Team in AP

Gujarth RTC Team in AP: గుజరాత్ ఆర్టీసీ టీం విజయవాడలోని పండిట్ నెహ్రు బస్​స్టేషన్​ను సందర్శించింది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను అక్కడి అధికారులు పరిశీలించారు. సంబంధిత అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Gujarth RTC Team in AP: గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రత్యేక బృందం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్​ను సందర్శించింది. గుజరాత్ ఆర్టీసీ ఎండీ జితేంద్ర సహా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పర్యటనలో పాల్గొన్నారు. విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలని పరిశీలించారు. బస్సులకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే కౌంటర్ సహా విచారణ కేంద్రం, మరుగుదొడ్లు , బస్టాండ్ లో స్క్రీన్​ల ఏర్పాటు తదితర అంశాలపై ఆరా తీశారు. బస్​స్టేషన్​లో ఏర్పాటు చేసిన సదుపాయాలను ఆర్టీసీ ఈడీలు.. గుజరాత్ బృందానికి వివరించారు. ఇక్కడి సదుపాయాలపై గుజరాత్ ఆర్టీసీ టీం సంతృప్తి వ్యక్తం చేసింది

ఇదీ చదవండి: CM Jagan in SLBC Meeting: ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల చొప్పున రుణం ఇవ్వండి: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.