ETV Bharat / city

Teachers Day: 'దేశ నిర్మాణంలో గురువులది ప్రముఖ పాత్ర'

author img

By

Published : Sep 4, 2021, 9:10 PM IST

Updated : Sep 5, 2021, 11:41 AM IST

విద్యార్థులను బాధ్యతాయుతులైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు.. గవర్నర్​, ముఖ్యమంత్రి జగన్​ శుభాకాంక్షలు తెలిపారు.

teachers days wishes to all
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌, ముఖ్యమంత్రి జగన్​.. శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు సమాజానికి వాస్తుశిల్పులని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. డా. రాధాకృష్ణన్.. దేశ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించారని గవర్నర్​ పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందబోదని గవర్నర్ అన్నారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి వల్ల విద్యాబోధనలో అంతరాయం నెలకొందన్నారు. ఈ తరుణంలో ఆన్‌లైన్, డిజిటల్ తరగతులను నిర్వహించడం ద్వారా ఉపాధ్యాయులు తమ విద్యా బాధ్యతలను నెరవేర్చడానికి చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.

ప్రతి ఒక్కరికీ హక్కుగా విద్య అందాలన్నది మా లక్ష్యం: సీఎం

భావిభారత పౌరుడి నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక భూమిక అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ హక్కుగా విద్య అందాలన్నది మా లక్ష్యం అన్న సీఎం జగన్​.. మేం చేపట్టిన విద్యా సంస్కరణలతో గురువుల బాధ్యత మరింత పెరిగిందన్నారు.

ఇదీ చదవండి..

farmers problems: బంగారంలాంటి బంతిపూలు.. లాభాల్లేక నేలపాలు..!

Last Updated : Sep 5, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.