ETV Bharat / city

ప్రభుత్వం మొద్దునిద్ర వీడి ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: అచ్చెన్న

author img

By

Published : Dec 6, 2020, 3:16 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు స్పృహ తప్పిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని... తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. స్థానికులకు తక్షణమే సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

eluru victims should be given better treatment says tdp leader achennaidu
ప్రభుత్వం మొద్దునిద్ర వీడి ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: అచ్చెన్న

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో ప్రజలు అస్వస్థతకు గురికావటంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన చెందారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

ఐదు రోజుల నుండి కలుషిత నీరు వస్తుందని ప్రజలు చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తక్షణమే సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఇదీ చదవండి:

అంతు చిక్కని పరిస్థితులు.. ఇంకా నమోదవుతున్న అస్వస్థత కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.