ETV Bharat / city

అక్బర్ బాషా కుటుంబానికి న్యాయం చేయాలి: సీపీఐ నేత రామకృష్ణ

author img

By

Published : Sep 11, 2021, 6:00 PM IST

సీపీఐ రామకృష్ణ
సీపీఐ రామకృష్ణ

అక్బర్ బాషా కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీనేతల భూదందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆయన మండిపడ్డారు.


కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబెల్లికి చెందిన అక్బర్ బాషా కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీలో అధికార పార్టీ నేతల భూదందాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు.

అక్బర్ బాషాకు చెందిన ఎకరంన్నర భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వైకాపా నాయకుడు తిరుపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న మైదుకూరు సీఐ కొండారెడ్డిని సస్పెండ్ చేయాలన్నారు.

ఇదీ చదవండి:
సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలి: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.