ETV Bharat / city

తెలంగాణలో 176 కరోనా కేసులు, ఒకరు మృతి

author img

By

Published : Feb 28, 2021, 11:51 AM IST

తెలంగాణలో కరోనా రెండో దశ ముప్పు పొంచి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో తాజా మరో 176 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఒకరు మృతి చెందారు.

తెలంగాణలో 176 కరోనా కేసులు, ఒకరు మృతి
తెలంగాణలో 176 కరోనా కేసులు, ఒకరు మృతి

తెలంగాణలో మరో 176 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,98,807 మందికి మహమ్మారి సోకగా ఇప్పటివరకు 1634 మంది మరణించారు.

కరోనా నుంచి మరో 163 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి నుంచి బయటపడిన వారి సంఖ్య 2,95,222కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,951 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 859 మంది హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో తాజాగా మరో 27 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:

ఈశాన్యం నుంచి వేడిగాలులు..రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.