ETV Bharat / city

CM JAGAN: 'ఏపీ సేవ 2.O'.. రాష్ట్ర అభివృద్ధిలో గొప్ప ముందడుగు: జగన్​

author img

By

Published : Jan 27, 2022, 3:26 PM IST

Updated : Jan 27, 2022, 8:32 PM IST

CM JAGAN: పాలనలో మరింత వేగం, పారదర్శకత, జవాబుదారీతనం కోసం సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ను ప్రారంభించినట్లు సీఎం జగన్‌ చెప్పారు. తాడేపల్లిలో ‘ఏపీ సేవ 2.0’ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఈ పోర్టల్‌ గొప్ప ముందడుగు అన్నారు. దీని ద్వారా ఒకే వేదికపై 540కు పైగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. సచివాలయాలపై సమీక్షించిన జగన్​.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు భర్తీచేయాలని ఆధికారులను ఆదేశించారు.

Cm jagan on CSWS 2.0
Cm jagan on CSWS 2.0

CM JAGAN: పౌర సేవలు వేగంగా, పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో ఏపీ సర్కార్‌ 'ఏపీ సేవా' పేరిట సిటిజన్ సర్వీస్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రజల అర్జీలు శాఖలవారీగా విడివిడిగా కాకుండా.. ఒకే పోర్టల్‌ పరిధిలోకి తెచ్చారు. ఈ మేరకు అభివృద్ధి చేసిన 'ఏపీ సేవ 2.O పోర్టల్‌'ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. రెవెన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35రకాల సేవలు పోర్టల్‌ పరిధిలోకి తెచ్చామన్నారు.

Cm jagan on CSWS 2.0: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540కి పైగా సేవలను అందిస్తున్నట్లు తెలిపిన సీఎం.. ఈ పోర్టల్‌ ద్వారా రెవెన్యూ, భూపరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను అదనంగా తీసుకొచ్చామన్నారు. మున్సిపాలిటీలకు చెందిన 25, పౌరసరఫరాలకు చెందిన 6, గ్రామీణాభివృద్ధి, విద్యుత్‌ రంగానికి చెందిన 53కు పైగా సేవలు ఈ పోర్టల్‌ కిందికి తీసుకొచ్చినట్లు జగన్‌ వివరించారు.

ఏపీ సేవ పోర్టల్‌తో మారుమూల గ్రామాల్లోనూ వేగంగా ప్రభుత్వ పథకాలు అమలవుతాయని చెప్పారు. ప్రజలు పలకడానికి అనువుగా ఉండేందుకు పోర్టల్‌కు ‘ఏపీ సేవ’ అని పేరు పెట్టినట్లు జగన్​ తెలిపారు. గ్రామస్వరాజ్యంలో ఏపీ సేవ పోర్టల్‌ ఓ గొప్ప ముందడుగని చెప్పారు. దీనిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పోర్టల్‌తో మారుమూల గ్రామాల్లోనూ పాదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందన్నారు.

మే నాటికి సచివాలయాల్లో పూర్తిస్థాయి ఆధార్‌ సేవలు

గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ఇది వరకు ప్రకటించిన విధంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. మే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిగా ఆధార్‌ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ మేరకు అవసరమైన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయాలని నిర్దేశించారు.

ఉత్తమ వాలంటీర్లకు ప్రోత్సాహకాలు

ఉగాది సందర్భంగా.. ఉత్తమ సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. ఉగాది నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి యూనిఫామ్స్‌ ఇవ్వాలన్నారు. సేవల కోసం ఎవరైనా లంచం అడిగితే... వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా తగిన వ్యవస్థ ఉండాలని సీఎం ఆదేశించారు. సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమం చాలా ముఖ్యమైందన్న సీఎం...ఈ కార్యక్రమం సమర్థంగా కొనసాగాలన్నారు.

‘ఏపీ సేవ 2.0’ ప్రారంభించిన సీఎం జగన్‌

ఇదీ చదవండి..:

Last Updated : Jan 27, 2022, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.