ETV Bharat / city

అచ్చెన్నను ఫోన్​లో పరామర్శించిన చంద్రబాబు

author img

By

Published : Feb 9, 2021, 11:55 AM IST

ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే.. అచ్చెన్నాయుడిపై జగన్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బెయిల్​పై విడుదలైన అచ్చెన్నను.. చంద్రబాబు ఫోన్​లో పరామర్శించారు.

chandrababu phone call to achennaidu after releasing from prison
అచ్చెన్నను ఫోన్​ ద్వారా పరామర్శించిన చంద్రబాబు

వైకాపా‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తూ.. అందరికీ అచ్చెన్నాయుడు ఆదర్శంగా నిలిచారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. బెయిల్​పై విడుదలైన అచ్చెన్నను.. చంద్రబాబు ఫోన్​లో పరామర్శించారు. అక్రమంగా కేసులు నమోదు చేసి బలహీనవర్గాలకు చెందిన నేతలను వేధిస్తున్న ప్రభుత్వానికి.. ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని చంద్రబాబు అన్నారు.

ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నపై.. జగన్‌ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలో.. తెదేపా నేతలను ఎదుర్కోలేక పోలీసు వ్యవస్థను స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలతో వేధిస్తున్నారన్నారని ఆరోపణలు చేశారు. ప్రజా క్షేత్రంలో పోరాడే నేతలే చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు ఉద్ఘాటించారు.

ఇదీ చదవండి: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్​పై విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.