ETV Bharat / city

'5 కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు'

author img

By

Published : Aug 4, 2020, 6:21 PM IST

chandrababu on cm jagan over 3 capitals
chandrababu on cm jagan over 3 capitals

వైకాపా ప్రభుత్వ హయాంలో ఎస్సీలపై దాడులు-దౌర్జన్యాలు, హత్యలు-అత్యాచారాలు, ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. 175 నియోజకవర్గాల తెదేపా నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్​ఛార్జ్​లు పాల్గొన్నారు.

అసెంబ్లీ రద్దు సవాల్​ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నేతలకు సూచించారు. గిరిజన ఆడబిడ్డలపై గ్యాంగ్ రేప్​లపై ధ్వజమెత్తాలన్నారు. కల్తీ మద్యం, శానిటైజర్ తాగి అనేకమంది చనిపోవడంపై నిరసన తెలపాలని దిశానిర్దేశం చేశారు. రాజధాని 3ముక్కల అంశం అజెండాగా.. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేయాలన్నారు. 48గంటల్లో స్పందించాలని ఛాలెంజ్ చేసినా సీఎం జగన్​లో కదలిక లేదని నేతలు చంద్రబాబుకు వివరించారు. 13జిల్లాలలో వైకాపా బాధిత ప్రజానీకం పెరిగిపోయిందని ఎమ్మెల్సీలు తెలిపారు. ఓటమి భయంతోనే సవాల్​కు స్పందించడం లేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. రాజధాని 3ముక్కల అంశాన్ని కావాలనే ఎన్నికల ముందు దాచిపెట్టారని..., ఎన్నికల్లో నమ్మించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇది 5 కోట్ల ప్రజలకు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు స్టేటస్‌ కో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.