ETV Bharat / city

విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులుగా అరకు ఎంపీ మాధవి

author img

By

Published : Sep 29, 2020, 9:46 PM IST

అరకు ఎంపీ మాధవి
అరకు ఎంపీ మాధవి

వైకాపా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి విదేశాల వ్యవహారాల కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. మొదటి సారి పార్లమెంట్ సభ్యురాలైన తనకు ఇంతటి అత్యున్నత అవకాశం రావటం సంతోషంగా ఉందని మాధవి హర్షం వ్యక్తం చేశారు.

విదేశాల వ్యవహారాల కమిటీ సభ్యులుగా అరకు పార్లమెంట్ సభ్యులు గొడ్డేటి మాధవి నియమితులయ్యారు. లోక్ సభలో 21 మంది సభ్యులకు అవకాశం ఉండగా... వారిలో మాధవికి స్థానం లభించింది. మొదటి సారి పార్లమెంట్ సభ్యురాలైన తనకు ఇంత అత్యున్నత అవకాశం రావటం సంతోషంగా ఉందన్నారు.

తన నియామకానికి కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్ , విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై శక్తివంచన లేకుండా గళం విప్పుతానని మాధవి చెప్పారు.

ఇదీ చదవండి:

ఈ లింక్​పై క్లిక్ చేయండి.. మన సీతాకోక చిలుకను గెలిపించండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.