ETV Bharat / city

ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్​పై నేడు విచారణ

author img

By

Published : Jul 14, 2020, 4:00 AM IST

ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్​పై నేడు విచారణ
ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్​పై నేడు విచారణ

ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డి అనర్హత పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.విప్‌ ఉల్లంఘించారంటూ తెదేపా సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ మండలి ఛైర్మన్ షరీఫ్ విచారణ చేపట్టనున్నారు.

పార్టీ ఫిరాయింపుపై మండలి సభ్యులు శివనాథరెడ్డి, పోతుల సునీత అనర్హత పిటిషన్‌పై శాసన మండలి ఛైర్మన్ షరీఫ్‌ వద్ద నేడు 4వ దఫా విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు మండలి ఛైర్మన్ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు మండలి కార్యదర్శి ఫిర్యాదుదారులకు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి లేఖల ద్వారా సమాచారం ఇచ్చారు.

పార్టీ విప్‌ ఉల్లంఘించినందున వారిరువురిపై అనర్హత వేటు వేయాలంటూ తెలుగుదేశం సభ్యులు బుద్దా వెంకన్న, అశోక్‌బాబు మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు సంబంధించి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు వారు ఫిర్యాదులో వివరించారు.

ఇదీచదవండి

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు హరిత ట్రైబ్యునల్ గ్రీన్​ సిగ్నల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.