ETV Bharat / city

మాధ్యమం ఎంపిక అవకాశం తల్లిదండ్రులకే

author img

By

Published : Apr 22, 2020, 5:18 AM IST

Updated : Apr 22, 2020, 11:29 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం దిగొచ్చింది. పిల్లలు ఏ మాధ్యమంలో చదవాలో ఎంపిక చేసుకునే అవకాశం తల్లిదండ్రులకే కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంగ్ల మాధ్యమం అమలుపై సర్కారు సరికొత్త ఆలోచన
ఆంగ్ల మాధ్యమం అమలుపై సర్కారు సరికొత్త ఆలోచన

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు ఏ మాధ్యమంలో చదవాలో ఎంపిక చేసుకునే బాధ్యతను ప్రభుత్వం తల్లిదండ్రులకే కల్పించింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చింది. ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో... తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అభిప్రాయాలు సేకరించనున్నారు. దీని ఆధారంగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. మే మొదటి వారంలోనే సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పేరెంట్స్ కమిటీలు ఆంగ్ల మాధ్యమంపై ఇచ్చిన అభిప్రాయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడంతో... ప్రభుత్వం ఈ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎక్కువమంది తల్లిదండ్రులు కోరుకున్న చోట తెలుగు మీడియం తరగతులు కూడా నడపాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

ఇదీచదవండి

'ఆంగ్ల మాధ్యమ జీవో రద్దుపై సుప్రీంలో సవాల్ చేస్తాం'

Last Updated : Apr 22, 2020, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.