ETV Bharat / city

తెలుగు గంగ కాలువలో... ఇద్దరు అన్నదమ్ములు గల్లంతు

author img

By

Published : Jun 1, 2022, 11:28 AM IST

brothers
అన్నదమ్ములు గల్లంతు

ఈతకు వెళ్లి ఉత్తరప్రదేశ్​కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు గల్లంతయ్యారు. ఈ ఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని తెలుగు గంగ కాలువలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

తెలుగుగంగ కాలువలో అన్నదమ్ములు గల్లంతయ్యారు. ఈ ఘటన తొట్టంబేడు మండలం తంగేళ్లపాళెం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శీతల, రాజకుమార్‌లు తంగేళ్లపాళెం సమీపంలోని ఓ ఇటుక బట్టీలో కూలీలుగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులను చూసేందుకు ఇద్దరు పిల్లలు సెంటు(18), పప్పు(16)లు ఇటీవల ఇక్కడకు వచ్చారు. వారు ఉన్న ప్రాంతానికి సమీపంలో.. తెలుగు గంగ కాలువ ప్రవహిస్తుండటంతో అన్నదమ్ములిద్దరూ సరదాగా ఈతకు దిగారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ కాల్వలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినా.. జాడ కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.