ETV Bharat / city

TTD: కరోనా కేసులు తగ్గగానే సర్వదర్శన టోకెన్ల జారీ పై నిర్ణయం: ఈవో జవహర్ రెడ్డి

author img

By

Published : Jul 2, 2021, 8:07 PM IST

తితిదే ఈవో జవహర్‌ రెడ్డి తిరుమలలో పలు అభివృద్ది పనులను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన కాటేజీల ఆధునీకరణ పనులను తనిఖీ చేసిన ఈవో పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో పూల మొక్కలను నాటి నిత్యం పర్యవేక్షించాలని సంబంధిత విభాగాధిపతులను అదేశించారు.

ఈవో జవహర్ రెడ్డి
ఈవో జవహర్ రెడ్డి

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు మరింత తగ్గాకే సర్వదర్శన టోకెన్లజారీపై నిర్ణయం తీసుకుంటామని.. తితిదే ఈవో జవహర్‌ రెడ్డి చెప్పారు. తిరుమలలో అభివృద్ధి పనులను పరిశీలించారు. కాటేజీల ఆధునీకరణ పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. స్వామివారి అలంకరణకు తిరుమల కొండపైనే ఐదెకరాల విస్తీర్ణంలో పూల మొక్కలు నాటి నిత్యం పర్యవేక్షించాలని సంబధిత విభాగాధిపతులనుఅదేశించారు. తిరుమల కొండపై పురాణాల్లో పేర్కొన్నటువంటి... 20 జాతుల మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నామని జవహర్‌రెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి:

space tour: తొలిసారిగా అంతరిక్షంలోకి తెలుగు మూలాలు ఉన్న మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.