ETV Bharat / city

'హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయ్.. కేంద్రం కల్పించుకోవాలి'

author img

By

Published : Sep 20, 2020, 10:26 AM IST

తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను.. తెదేపా ఎంపీ కనకమేడల.. రాజ్యసభలో ప్రస్తావించారు. వైవీ తీరుతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు.

TDP MP Kanaka medala  on TTD Declaration in Rajya Sabha
TDP MP Kanaka medala on TTD Declaration in Rajya Sabha

తెదేపా ఎంపీ కనకమేడల

తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్‌ అవసరం లేదన్న తితిదే ఛైర్మన్‌ వైవీ వ్యాఖ్యలపై రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగిన విషయాన్ని రాజ్యసభలో.. తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రస్తావించారు. రాష్ట్రంలో దేవాలయలపై జరుగుతున్న దాడులు... హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని.. కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని హిందువుల మనోభావాలు కాపాడాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.