ETV Bharat / city

'ఓటమి భయంతోనే సీఎం జగన్​ తిరుపతి పర్యటన'

author img

By

Published : Apr 7, 2021, 6:26 PM IST

ఓటమి భయంతోనే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారానికి ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారని.. మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వైకాపా నేతల అహంకారపూరిత వ్యాఖ్యలను తిరుపతి ప్రజలు గుర్తించారన్నారు. తిరుపతిలో ఉండటానికి ఎవరూ ఇష్టపడరని.. సీఎం జగన్‌ గతంలో వ్యాఖ్యలు చేశారన్న ఉమ.. ఆ వీడియోను మీడియా ముందుంచారు.

tdp leader devineni uma comments on cm jagan
tdp leader devineni uma comments on cm jagan

మాజీ మంత్రి దేవినేని ఉమ

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఓటమి భయంతోనే తొలిసారిగా సీఎం జగన్.. తిరుపతిలో రాజకీయ పర్యటనకు వస్తున్నారని మాజీమంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. ఉపఎన్నికలు, స్థానిక సంస్థలు ఏం జరిగినా సీఎం జగన్ ప్రచారానికి రానవసరం లేదన్న వైకాపా నాయకులు... ఇప్పుడేం చెప్తారని ప్రశ్నించారు.

తిరుపతిలో ఉండటానికి ఎవరూ ఇష్టపడరని గతంలో జగన్ వ్యాఖ్యలు చేశారని దేవినేని ఉమ ఆరోపించారు. సీఎం జగన్​ రెండేళ్ల కాలంలో అసలేం అభివృద్ధి చేశారని ఓట్లడుగుతారని ప్రశ్నించారు. జగన్ తిరుపతి పర్యటనతోనే వైకాపా ఓటమి ఖరారయ్యిందని చెప్పారు.

ఇదీ చదవండి:

ముఖ్యమంత్రి జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం బాధాకరం: భానుప్రకాశ్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.