ETV Bharat / city

తిరుపతిలో చిరుత పులుల సంచారం.. ఆందోళనలో ప్రజలు

author img

By

Published : May 24, 2021, 11:53 AM IST

చిరుత పులుల బారి నుంచి తమను కాపాడాలని కోరుతూ తిరుపతి ప్రగతి నగర్ వాసులు విజ్ఞప్తి చేశారు. కపిలతీర్థం పరిసర ప్రాంతాల్లో ఇటీవల రాత్రిపూట సమయాల్లో తరచూ చిరుతలు సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Wandering leopard tigers
చిరుత పులుల సంచారం

తిరుపతి ప్రగతి నగర్ లో చిరుత పులుల భయాందోళనకు గురి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. కపిలతీర్థం పరిసర ప్రాంతాల్లో ఇటీవల రాత్రి సమయాల్లో తరచూ చిరుతలు సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ఫ్యూ నిబంధనల కారణంగా ఆలయ దర్శన వేళల సమయాన్ని కుదించటంతో.. శేషాచలం అటవీ ప్రాంతాల నుంచి వన్యప్రాణాలు వచ్చి కాలనీల్లో సంచరిస్తున్నాయని చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని భద్రతా ఏర్పాట్లను చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండీ.. కొవిడ్ ఆస్పత్రులను సందర్శించకుండా.. తెదేపా నేతల గృహ నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.